Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కార్యకర్తలను ఆయన దగ్గరకు కూడా రానివ్వడని చెప్పారు. పవన్కు కార్యకర్తలు వచ్చి షేక్హ్యాండ్ ఇవ్వకూడదని.. వారిని అడ్డుకునేందుకు ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున జీతాలిచ్చి బౌన్సర్లను పెట్టుకున్నారని తెలిపారు. రోజుకు మూడు షిఫ్టుల్లో ఆ బౌన్సర్లు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ముట్టుకోకూడదని.. షేక్హ్యాండ్ ఇవ్వకూడదనే పవన్ కల్యాణ్.. బ్లేడ్బ్యాచ్ వచ్చేస్తోందంటూ పవన్ నెపం వేయడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. ప్రజల దగ్గరకు రాలేనప్పుడు పవన్ కళ్యాణ్కు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. తామంతా ప్రజల్లోనే తిరుగుతున్నాం కాదా.. తమపై బ్లేడ్ బ్యాచ్ దాడులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.
కార్యకర్తలను దగ్గరకు కూడా రానివ్వడని చెప్పారు. పవన్ చుట్టూ రోజుకు మూడు షిఫ్టుల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారని తెలిపారు. చుట్టూ బౌన్సర్లను పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. బ్లేడ్ బ్యాచ్ అంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.