అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీకి (YSRCP) ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి (Mangalagiri) ఆళ్ల రామృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) తన శాసనసభా సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా సమర్పించానని ప్రకటించారు. సీఎం జగన్కు (CM Jagan) అత్యంత విధేయుడిగా పేరున్న ఆర్కే రాజీనామా నిర్ణయం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేష్ను ఓడించారు.
కాగా, మంగళగిరి వైసీపీ ఇన్చార్చ్గా గంజి చిరంజీవిని నియమించడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో తన నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన గతకొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లోనే తాను రాజీనామా చేశానని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. అయితే శాసనసభాపతి అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీకి అందిచానని చెప్పారు. మంగళగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తీరువళ్లే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
♦️మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా.
♦️ఈ మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఇచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి#YSRCP #Mangalagiri #AllaRamakrishnaReddy pic.twitter.com/pCRv4oQMda— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) December 11, 2023