అమరావతి : వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) మరోసారి స్వల్ప అస్వస్థతకు( Illness ) గురయ్యారు. ఏపీ శాసస మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు గురికావడంతో అధికారులు వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేశారు.
బీపీ హెచ్చు, తగ్గుదల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు దృవీకరించారు. కాగా మెరుగైన చికిత్స కోసం బొత్సను హైదరాబాద్కు తరలించారు. అసెంబ్లీ వైద్యులు బొత్సకు రెగ్యులర్గా చికిత్స అందించే వైద్యులతో మాట్లాడారు. విశ్రాంతి అవసరమని వారు పేర్కొన్నారు. ఇటీవల బొత్స బ్రేయిన్ స్ట్రోక్కు గురి కాగా హైదరాబాద్కు తరలించి చికిత్స అందజేశారు.