అమరావతి: ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఏపి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, ఉద్యోగులు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 27శాతం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని మరువవద్దని మంత్రి ఉద్యోగులను కోరారు.
కరోనా కారణంగా రాష్ట్రం గత రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని గుర్తించాలని ఉద్యోగులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఒకేసారి నాలుగు డీఏలు ఇచ్చామని మంత్రి బాలినేని తెలిపారు. విద్యుత్ శాఖలో పీఆర్సీపై కమిటీని ఏర్పాటు చేశామని, మిగిలిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.