అమరావతి : గుంటూరు జిల్లాలో టీడీపీకి చుక్కెదురైంది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది. జనసేన ఒక్క స్థానంలో గెలుపొందింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలోని 12 వార్డుల్లో వైసీపీ జెండా ఎగురవేయగా.. ఐదు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.
జనసేన రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడింది. 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా, ఏడు స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. 1, 2, 5, 6, 7, 8, 9 వార్డుల్లో వైసీపీ విజయం సాధించగా.. మిగిలిన స్థానాల్లో టీడీపీ గెలిచింది