YS Sharmila | న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. 117 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ జాబితాను రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఏపీ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మల పేర్కొన్నారు. ఇక సీనియర్ నేత, మాజీ పీసీసీ రఘువీరా రెడ్డి ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు సమాచారం. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని, కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని రఘువీరారెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచి పల్లం రాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, రాజమండ్రి నుంచి గిడుగు రుద్ర రాజు పోటీ చేయనున్నట్లు సమాచారం.