అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పంలో ఆస్పత్రి భవనం పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి (30) అనే యువకుడు నిన్న రాత్రి కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు అతడిని హుటాహుటిన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
అతడికి వైద్యులు పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆచారి రాత్రి ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.