అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడ్డ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు( Thota Trimurtulu) కు బెయిల్ మంజూరు అయ్యింది. 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 5గురు దళితుల (Dalits) ను హింసించి, ఇద్దరికి శిరోముండనం చేశారు. ఈ కేసులో ఉన్న నిందితుల విచారణ విశాఖ కోర్టు (Visakhapatnam Court) లో 28 ఏండ్ల సుదీర్ఘకాలంగా కొనసాగింది.
మంగళవారం మరోసారి విచారణ కొనసాగగా కోర్టు నిందితులకు 18 నెలల పాటు జైలు శిక్ష, రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. శిక్ష పడ్డ కొంత సేపటికే వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ అభ్యర్థి త్రిమూర్తులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.