అమరావతి : ఈవీఎంల ధ్వంసం కేసులో ఏ1గా ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ( Macharla YCP MLA ) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిన్నెల్లి గృహనిర్బంధం నుంచి తప్పించుకుని పారిపోవడంతో ఆయన కోసం పోలీసులు రెండు తెలుగురాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడికైనా విమానంలో పారిపోవచ్చనే అనుమానంతో అతడిపై లుకౌవుట్ నోటీసు జారీ చేశారు.
నిన్న సంగారెడ్డిలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకునే లోగా పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోసం ప్రత్యేకంగా 8 బృందాలతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. తనను పోలీసులు అరెస్టు చేయకుండా నేరుగా హైకోర్టు ఎదుట లొంగిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణకు అనుమతిచ్చింది. మరి కొద్దిసేపట్లో బెయిలా? రిమాండా అనే అంశం తేలనుంది.