అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం(MLA Adimoolam) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ను కలవడం చర్చంశానీయంగా మారింది. వైసీపీ(YCP) ఎమ్మెల్యేగా రెండుసార్లు సత్యవేడు నుంచి గెలిచిన ఆదిమూలం కొన్ని రోజులుగా జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి(Minister Peddireddy) పై గుర్రుగా ఉన్నారు.
రాబోయే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన సత్యవేడు నుంచి మరోసారి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్కు పంపుతుండడం పట్ల ఆయన అసంతృప్తిలో లోనయ్యారు. ఈ నిర్ణయం వెనుక మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన పాత్ర పోషించారని అనుమానాలు వ్యక్తం చేస్తూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడు స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి అక్రమంగా ఇసుక తవ్వకాలు(Sand Mafia) చేపట్టారని ఆరోపించారు. మంత్రి అక్రమాలన్నింటినీ నాపై తోశారని ఆరోపించారు.
మంత్రి పెద్దిరెడ్డి చేసిన కుట్రలో భాగంగానే తనను ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించి ఎంపీ స్థానానికి పంపిస్తున్నారని విమర్శించారు. 1989లో మోటారు సైకిల్పై తిరిగిన పెద్దిరెడ్డి వందలాది కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని పేర్కొన్నారు. తాను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, దోచుకోవడానికి కాదని అన్నారు.
వైసీపీలో తనకు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇస్తున్న వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్న ఆదిమూలం మంగళవారం లోకేష్ను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.