అమరావతి : చిత్తూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది. జిల్లాలోని కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్గా పనిచేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆలయానికి పాలకవర్గం చైర్మన్గా, సభ్యులుగా కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది .
ఇదే సందర్భంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేశారు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు.