Botsa Satyanarayana | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున సిటీ న్యూరో సెంటర్లో చేర్పించారు.
ప్రస్తుతం బొత్సకు ట్రీట్మెంట్ కొనసాగుతున్నదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బొత్సను రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ఇక తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘నా ఆరోగ్యంపై ఆందోళన అనవసరం. రోటీన్ చెకప్లో భాగంగా దవాఖానకు వచ్చాను..’ అని తెలిపారు.