హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీలో సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు.
మూడు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్నది. అదేరోజు సాయం త్రం ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. శుక్ర వారం ప్రధానితో ఆయన భేటీ కానున్నారు.