అమరావతి : మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో వైసీపీ చెందిన కౌన్సిలర్ ఒకరు మీసేవా నిర్వాహకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా నర్సిపట్నంలో చోటు చేసుకుంది. మీసేవా నిర్వాహకుడు విజయ్ పసుపు చొక్కా వేసుకున్నాడనే కోపంతో కౌన్సిలర్ కత్తితో దాడి చేసి గాయపర్చాడు. గాయపడ్డ బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.