తిరుమల: తిరుమలలో ఐదేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. తిరపతి దామినీడుకు చెందిన ఓ మహిళ తిరమలలో తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన కుమారుడు గోవర్ధన్ రాయల్ను (5) తిరుమలలోని అఖిలాండం వద్ద కూర్చోబెట్టి వస్తువులను అమ్మడానికి వెళ్లింది. అయితే తిరిగివచ్చి చూడగా అతడు అక్కడ కనిపించలేదు. దీంతో పరిసరాల్లో వెతికిన ఆమె.. బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా బాలుడిని ఓ మహిళ బస్సులో తిరుపతి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 5.45 గంటలకు జరిగిందని తెలిపారు.