అమరావతి : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుకు మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. సమస్యలను పరిష్కరించడం లేదంటూ నిలదీశారు. ఎస్. రాయవరం మండలం సోముదేవుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న బాబురావును నాయకులను, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరాహనది గట్టుపై రోడ్డు, వీధి దీపాలు లేవని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు, వీధి దీపాలు లేక ప్రమాదాల బారిన పడుతున్నామని , అనేకసార్లు తమ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు.