అమరావతి : గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దారుణం జరిగింది. మండలంలోని తుమ్మపూడిలో ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేయడం గ్రామంలో కలకలం సృష్టిస్తోంది. ఇంట్లో ఉన్న తిరుపతమ్మ (40) అనే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగులు ఆమెను హత్య చేసి పారిపోయారు. మొదట్లో అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు మృతిరాలి ఒంటిపై ఉన్న గాయాలతో ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్తో గాలింపు చర్యలు ప్రారంభించారు. మహిళ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.