విజయనగరం: జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం లభించింది. పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా కనిపిస్తున్నది. డెంకాడ మండలం దయాల్నగర్-బేతనపల్లి మధ్య మృతదేహం పడిఉన్నది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆమె శరీరం మొత్తం గుర్తుపట్టలేనతంగా కలిపోయింది. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతురాలు ఎవరో, ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆమెపై దుండగులు లైంగికదాడికి పాల్పడిన అనంతరం పెట్రోల్ పోసి సజీవదహనం చేసినట్లు ఘటనను చూస్తే అర్థమవుతున్నదని పోలీసులు అంటున్నారు. ఎక్కడో హత్యగావించిన దుండగులు.. ఆమెను కాల్చివేసేందుకు ఈ నిర్మానుష్యాప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మిస్టరీ డెత్గా నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. ఇటీవలి కాలంలో పీఎస్లలో నమోదైన యువతుల మిస్సింగ్ ఫిర్యాదులను పరిశీలించే పనిలో పోలీసులు ఉన్నారు.