AP news | ఏపీలోని విజయనగరం(Vizianagaram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావ కొడుకుతో సహజీవనం(Living together) చేస్తున్న ఓ మహిళ తన ప్రియుడిపై యాసిడ్(Acid) పోసి, ఇనుపరాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం చెందిన దనాల రాములమ్మ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తన బావ కుమారుడైన శ్రీనుతో సన్నిహితంగా మెలిగింది. అతడు కూడా తన భార్యకు ఉంటున్నాడు. కొంతకాలంగా రాములమ్మ, శ్రీను సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేస్తున్న జంట మధ్య గురువారం తెల్లవారుజామున తీవ్ర ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో ఆవేశానికి గురైన రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై బలంగా కొట్టింది. అనంతరం యాసిడ్ పోయడంతో తీవ్రగాయాలతో శ్రీఉ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రాములమ్మ పురుగుల మందు తాగడంతో గమనించిన స్థానికులు ఆమెను దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.