అమరావతి : భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను త్వరలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల నాయకులతో శనివారం మాట్లాడారు. టీడీపీ శ్రేణులు బాధితులు ఆదుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయ, సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
వరద ప్రాంతాల్లోని పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వాలని సూచించారు. ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందుల పంపిణీ జరుగుతుందని , పార్టీ శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయని చంద్రబాబు తెలిపారు.