Ananthapur | అనంతపురం : కళ్ల ముందే భర్త హత్యకు గురయ్యాడు. తట్టుకోలేక భార్య గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
వన్టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జేఎన్టీయూ సమీపంలో మూర్తి రావు గోఖలే(59), ఆయన భార్య శోభ(56) నివసిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో మేనల్లుడు ఆదిత్య దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరగడంతో కత్తితో ఆదిత్య, మూర్తి రావు గొంతు కోసి హతమార్చాడు. కళ్ల ముందే భర్తను హత్య చేయడంతో.. భార్య తట్టుకోలేక అదే రోజు అర్ధరాత్రి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. దంపతుల మృతితో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.