అమరావతి : వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి ( MLA Balineni Srinivas Reddy ) అధిష్టానంపై ఉన్న అలకను వీడారు. తాను వైసీపీ(YCP) ని వీడడం లేదని స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాగుంటకు అవకాశమివ్వాలని తాను ఒక్కరినే అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడంపై మనస్సు మార్చుకున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఎంపీ అభ్యర్థి పేరుపై పట్టనట్లుగా ఉంటున్నారని, వారికి లేని బాధ తనకెందుకని పేర్కొన్నారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉంటే అన్ని నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుందన్న ధీమాతో పార్టీ అధిష్టానంపై ఒత్తిళ్లు తీసుకొచ్చానని ఆయన అన్నారు. తాను పార్టీ నుంచి వీడిపోవడం లేదని, ఒంగోలు నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తా. నా ఒంగోలు నేడు చూసుకుంటానని వెల్లడించారు.