హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగనిరీతిలో ఓ సామాన్య వ్యక్తి ప్రభంజనం సృష్టించారు. కనీసం ఆయన ప్రజలకు తెలియదు. రాజకీయ కుటుంబం కాదు. అంత కంటే పెట్టుబడిదారుడు కూడా కాదు. కానీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి 2 లక్షల 65 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది తెలుగు రాష్ర్టాల ప్రజలను ఆకర్షించారు.
మరి ఆయన ఏవరు? ఓ సామాన్య వ్యక్తికి సీఎం జగన్ టికెట్ ఎందుకిచ్చారు? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం. సాధారణ ఫిజియోథెరపిస్టు అయిన గురుమూర్తికి వైఎస్సార్ కుటుంబం అంటే ఎనలేని ప్రేమ. ఈ క్రమంలో జగన్ వైఎస్సార్ పార్టీ స్థాపించినప్పటీ నుంచి గురుమూర్తి ఓ సామాన్య కార్యకర్తగా పార్టీలో కొనసాగుతున్నాడు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రలోనూ గురుమూర్తి పాల్గొన్నాడు. ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలోనూ ఆయనకు వ్యక్తిగత ఫిజియోథెరపిస్టుగా సేవలందిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. ఈ క్రమంలోనే గురుమూర్తి అంటే జగన్కు అభిమానం ఏర్పడిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
2019 సాధారణ ఎన్నికల్లో గెలిచిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గతేడాది కరోనాతో చనిపోయారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ అనూహ్యంగా గురుమూర్తి పేరును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ సమయంలో అన్నా తన వద్ద రూ. 10 లక్షలు కూడా లేవు.. తాను ఎలా పోటీ చేయాలని అడిగినప్పుడు.. నువ్వు పోటీ చేయ్.. ఒక్క పైసా కూడా అవసరం లేదు. అంతా పార్టీ చూసుకుంటుందని చెప్పి గురుమూర్తికి భరోసా ఇచ్చి ఎన్నికల రణరంగంలోకి దింపారు. అలా పార్టీకి విధేయుడైనా గురుమూర్తిని వైఎస్సార్ సీపీ గెలిపించుకుంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో గురుమూర్తి 2 లక్షల 65 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.
ఇవి కూడా చదవండి..