అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఏవో జానకీరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. మున్సిపల్ కార్యాలయంపై అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు. ఓ గుత్తేదారు నుంచి ఏవో రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పెండింగు బిల్లుల మంజూరుకు లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీంతో ఏసీబీ అధికారులు వ్యూహం పన్ని కార్యాలయంలో బాధితుడి నుంచి ఏవో లంచం తీసుకుంటుండగా మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఏవోను రిమాండ్కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.