అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరిట నవ మోసాలకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ( Chandrababu ) ఆరోపించారు. కృష్ణా జిల్లా పెడనలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం (Prajagalam) ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కూటమిని గౌరవించాలని సూచించారు.
సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరిగి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని అన్నారు. ఇసుక (Sand) క్వారీలు, అక్రమ మద్యం , భూములను దోచుకుని సంపదను పెంచుకున్న వైసీపీ నేతలకు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. నీతి, నిజాయితీ, అభివృద్ధి,సంక్షేమమే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు.
2014లో వైఎస్సార్ మరణం, 2019లో బాబాయి వైఎస్ వివేకా హత్య, నేడు పింఛన్దారుల శవాలతో సానుభూతి పొంది ఎన్నికల్లో లబ్ది పొందాలని సూచిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా వచ్చాయని, వైసీపీ ఓటమి ఖాయమని తెలిసిపోయిందని అన్నారు.