(Chandra Babu) మంగళగిరి : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండాపోతున్నదని, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రత్యేక పరిస్థితుల్లో 36 గంటల దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్ష చేపట్టారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబింబమైన టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే దాడి జరిగిందని విచారం వ్యక్తం చేశారు. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే తమపై, తమ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా పోలీసులకు చీమకుట్టినట్లయినా లేకపోయిందన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. డ్రగ్స్ సరఫరాను అడ్డుకోమంటే మాపైనే దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అధికారంలో ఉన్నామని విర్రవీగితే తగిన బుద్ధి చెప్తామని టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. టీడీపీ కేంద్రా కార్యాలయంపై జరిగిన దాడి ఘటన వ్యవహారాన్ని సీబీఐచేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గంజాయి సరఫరాపై ప్రశ్నిస్తే దాడులకు దిగడమేంటి? ఎట్టిపరిస్థితుల్లో భయపడేది లేదని, వారిని విడిచిపెట్టేది లేదన్నారు. ఘటనపైనే కాకుండా డీజీపీ పాత్రపై కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని పయ్యావుల డిమాండ్ చేశారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఎదురుదాడికి దిగుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మలు డీజీపీ తీరుతో ఘోషించకమానవన్నారు. రెండున్నరేండ్లలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని, సీఎం, డీజీపీ కుట్రపన్ని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలేది లేదని, వారెవ్వరైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు చెప్పారు.
డిసెంబర్ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్లీ గురూ!
ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..