అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 142 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు కొవిడ్తో మృతి చెందారని వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. మొత్తం 32,793 మంది నుంచి పరీక్షలు నిర్వహించగా , చికిత్స పొందుతూ 188 మంది కోలుకున్నారని , ప్రస్తుతం 1989 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అనంతపురంలో 17 మంది, చిత్తూరులో 14, ఈస్ట్ గోదావరిలో 21, వెస్ట్ గోదావరిలో 17, గుంటూరులో 28 మంది, కృష్ణాలో 13, విశాఖపట్నంలో 10 మందితో పాటు ఇతర జిల్లాలో మరి కొంత మంది కరోనా బారిన పడ్డారని వివరించారు.