అమరావతి : ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డయాఫ్రమ్ వాల్ ఎంత మేర దెబ్బతిన్నదో నిర్ధారణకు సమయం పడుతుందని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థ చెప్పిందని వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడపై నిర్ధారణ వచ్చేంత వరకు పోలవరం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగదని వివరించారు.
పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ కోరుకుంటోందని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి టీడీపీ కారణం కాదా అని ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎందుకు అనుమతించారని పీపీఏ, సీడబ్ల్యూసీ, కేంద్రాన్ని అడుగుతామని పేర్కొన్నారు.