అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని (Hyderabad Joint capital) ఉంచాలని ఎన్నికల తరువాత కేంద్రాన్ని కోరనున్నామని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ( YV Subbareddy ) వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ఉంచారని, ఈ సమయంలో గత ప్రభుత్వం ఏపీ రాజధానిని నిర్మించలేకపోయిందని ఆరోపించారు.
వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మించడం కష్టమన్న భావనతో అభివృద్ధి చెందిన విశాఖనగరాన్ని(Visaka) పరిపాలన రాజధానిగా చేయాలని ప్రయత్నించామని తెలిపారు. కొందరు న్యాయపరమైన చిక్కులు సృష్టించడంతో చిక్కులు తొలగేవరకూ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించమని కేంద్రాన్ని అడుగుతామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు.
90శాతం వరకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు పూర్తయిందని పేర్కొన్నారు. నెలాఖారులోగా పేర్లను ప్రకటిస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వం నవరత్నాల పేరిట అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు.