అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న సమాచారం తమకు ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, దానిపై స్పందించడం కూడా అనవసరమని అన్నారు.
ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన జనం కరోనాతో రోడ్డక్కలేదని, దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బతికిపోయారని విమర్శించారు. గడిచిన రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని అన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ నాయకులు దెబ్బతీశారని చంద్రబాబు ఆరోపించారు