అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్హాట్గా ప్రారంభమయ్యాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బడ్జెట్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నిరసనలు, నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్..గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ బడ్జెట్ ప్రతులను చింపివేశారు. కొద్దిసేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపిన అనంతరం సమావేశం నుంచి బయటకు వెళ్లి అసెంబ్లీ లాబీలో బైటాయించి నిరసన తెలిపారు. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు.
దీంతో మార్షల్స్, టీడీపీ సభ్యుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన బిశ్వభూషణ్కు ఏపీ సీఎం జగన్, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వాగతం పలికారు. ముందుగా జాతీయ గీతంతో సమావేశాలను ప్రారంభించిన అనంతరం గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.