అమరావతి : స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లిన వీఆర్వో నీటమునిగి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జరిగింది. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి వీఆర్వోగా పనిచేస్తున్న అనంతపురానికి చెందిన నూర్ మహమ్మద్ మిత్రులతో కలిసి సరదాగా పీఏబీఆర్ జలాశయానికి వెళ్లాడు. భోజనం అనంతరం అతడు మిత్రుడితో కలిసి నీటిలో దిగారు.
అయితే లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. మోహిత్ సురక్షితంగా బయటికి రాగా నూర్ మహమ్మద్కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి పోయాడు. ఇతర మిత్రులు అతడిని నీటి నుంచి బయటికి తీసుకురాగా అప్పటికే వీఆర్వో మృతి చెందాడు. మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.