అమరావతి : ఈనెల 8న విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant ) లో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 10కి చేరుకుంది. శనివారం పెదగంట్యాడలోని సీతానగరం ప్రాంతానికి చెందిన గోకివాడ సూరిబాబు ( Suri Babu ) సెవెన్హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్టీల్ప్లాంట్లో ఉక్కుద్రవం లీకై ప్రమాదం జరుగగా ఘటన ప్రాంతంలోనే 8 మంది చనిపోగా మరుసటి పైడిరాజు అనే కార్మికుడు మృతి చెందాడు. మరో 8 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.