అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విశాఖలో పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలో చంద్రబాబు రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఏపీ టూరిజం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కూల్చిన రిసార్ట్ను పరిశీలనకు బయలు దేరిన బాబు బృందానికి అనుమతి లేదంటూ ఎండాడ జాతీయరహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.
రిషికొండలో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు టీడీపీ నాయకులతో వెళ్తుండగా పలువురిని అదుపులోకి తీసుకుని ఆటోలో ఇతర ప్రాంతాలకు తరలించారు. తనను అడ్డుకోవడంతో చంద్రబాబు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కొద్దిసేపటి అనంతరం బాబు రిషికొండ పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరిగారు.