అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి లేఖ రాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవాలని జగన్ కు మరోమారు లేఖ రాసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం కు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఘాటుగా లేఖ రాసింది. శాసనసభలో మరోసారి చర్చించి రాష్ట్ర నిర్ణయాన్ని కేంద్రానికి పంపాలని కోరింది. అంతేకాదు మరోమారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రధానికి లేఖ రాయండంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని విస్తరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని భావిస్తున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీజేపీ తప్ప అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నాయి.