VIPs @ Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సెల్వమణి ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈవో పెద్దిరాజు పూలమాలు వేసి అర్చక వేద పండితులతో తిలకధారతో స్వాగతం పలికారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి రోజా సెల్వమణి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు. ఈకార్యక్రమంలో ఏఈవో మోహన్, శ్రీశైలం సిఐ దివాకర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.