విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే దీక్షల విరమణకు కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో రేపు, ఎల్లుండి వీఐపీ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.