తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తాటికోనలో గ్రామస్థులపై తేనేటిగలు దాడి చేశాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్ కోసం తాటికోన గుట్టకు వెళ్లిన 40 మంది గ్రామస్థులపై ఒక్కసారిగా తేనేటిగలు దాడిచేయడంతో గ్రామస్థులు పరుగులు తీశారు.
తేనేటిగల బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న క్రమంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 20 మందికి గాయాలయ్యాయి.