అమరావతి: గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చని హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఇంటిని గ్రామస్థులు ముట్టడించారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమర్తి మండలం తమ్మినాయనిపల్లి గ్రామానికి రోడ్డు వేస్తామంటూ 8 నెలల కిందట ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన నిర్వహించారు.
ఇంట్లో ఎమ్మెల్సీ లేకపోవడంతో ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. వర్షాకాలంలో రోడ్డు దుస్థితి వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రతీ రాజకీయ నాయకుడికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు.