అమరావతి : విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కేశినేని నాని (MP Kesineni Nani) తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తరువాత కూడా తాను పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావిస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదం చేయించుకుంటానని తెలిపారు. ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు.
నిన్న(శుక్రవారం) కేశినేని నాని ( MP Kesineni Nani ) సొంతపార్టీ, అధినేతపై పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడిస్తే పెద్దస్థాయిలో ఉండేవాడినని అన్నారు. టీడీపీ (TDP)లో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలో పాల్గొన వద్దంటూ సమాచారాన్ని అందించడం పట్ల ఒకింత ఆయన అసహనానికి గురయ్యారు.
ఆయన తరుచూ పార్టీపై ఆరోపణలు చేస్తుండడంతో పార్టీలో ఆయన కేంద్ర బింధువుగా మారారు. పార్టీ మారుతాడని ప్రచారం జరుగుతున్నా వాటిని ఖండిస్తూ వచ్చారు. కొద్ది రోజుల్లో తన అనుచరులు, నాయకులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన ఆయన స్పీకర్కు రాజీనామా అందజేస్తానని ట్విటర్ ద్వారా ప్రకటించడంతో ఇక టీడీపీకి గుడ్బై చెప్పనున్నారు. ‘ ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచా. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి మూడోసారి విజయం సాధిస్తాన’ ని ధీమాలో ఉన్నారు కేశినేని నాని.