అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త ఆర్థిక మంత్రి యనమల అని దుయ్యబట్టారు. అంతేకాకుండా ఆయనను కట్టప్పగా అభివర్ణించారు.
యనమల రామకృష్ణుడు ఒక్క ఏడాది కాలంలోనే 300 రోజులకుపైగా ఓవర్ డ్రాఫ్ట్ర్ వేస్ అండ్ మీన్స్కు వెళ్లిన చరిత్రను సంపాదించుకున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ విధానాలు, వితండ వైఖరి కారణంగానే.. ఇప్పుడు ఆర్థిక వనరుల కోసం తమ ప్రభుత్వం వెతుక్కోవాల్సిన అగంత్యం నెలకొన్నదని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. పెద్ద మేధావి అని యనమల బిల్డప్ ఇస్తారని విజయసాయిరెడ్డి చురక అంటించారు. యనమల ఒక నమ్మక ద్రోహి అని, రాష్ట్ర ప్రజలు ఆయనను ఎప్పుడో మరిచిపోయారని విజయసాయిరెడ్డి చెప్పారు.