Vijayasai Reddy | రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ పునరాగమనంపై స్పష్టతనిచ్చారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ(New political party )పెడుతానని ఆయన తెలిపారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంత తగ్గి వర్షాలు కురువాలని భగవంతుడిని ప్రార్థించినట్లు విజయసారథి చెప్పారు.
ఇన్నాళ్లు ఊరిస్తూ వస్తున్ ఆయన పొలిటిక్ ఎంట్రీకి క్లారిటీ రావడంతో మాజీ ఎంపీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పేరు ‘ భారత్ జన వికాస్ ‘ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు ‘భారత్ జన వికాస్’ పేరు పెట్టినట్లుగా చెబుతున్నాయి. ఆయన మాత్రం ఇప్పటి వరకు కొత్త పార్టీ పేరుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.