అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా
తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘పుష్కరాల్లో షూటింగ్ చేసి ‘శవాల దిబ్బ’ను చూశాడు చంద్రబాబు. బూటకపు ఎన్కౌంటర్లతో ‘శవాల గుట్ట’ను చూశాడు. రైతులపై కాల్పులు జరిపించి రాక్షసానందం పొందాడు. శవాలను చూడ్డానికే రాజకీయ లబ్ధి కోసం కరోనా కాలంలో ధర్నాలు – నిరసనలు, సినిమా ట్రిక్కులు, ‘గులక రాయి’ రాజకీయం చేశాడీ మృత్యు బేహారీ’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
‘వరుస ఓటముల వల్ల ప్రతిపక్ష నాయకుడికి ప్రజలపై ద్వేషం పెరుగుతోంది. కరోనా కాలంలో చంద్రబాబు తన మార్కు శవ రాజకీయాలకు తెరలేపాడు. ఎక్కడ శవం దొరుకుతుందా పీక్కుతిందామనుకునే రాబందులా చూస్తున్నాడు. పుష్కరాల్లోనే “శవాల గుట్ట”ను చూడాలనుకున్న వ్యక్తి నుంచి ఇంతకన్నా ఆశించలేం’. అంటూ మరో ట్వీట్లో విమర్శించారు.