పనులు త్వరగా ఏర్పాటు చేయాలి : అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
మహబూబ్నగర్ టౌన్, జూన్7: సెగ్రిగేషన్ మిషన్ తో వ్యర్థాల రీసైక్లింగ్ చేసి వ్యర్థాల నుంచి సంపదను సృష్టించవచ్చని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్ అన్నారు. కోయిలకొండ ఎక్స్రోడ్డులోని డంపింగ్యార్డులో సెగ్రిగేషన్ మిషన్ విడిభాగాలను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరగా పనులు పూర్తి చేసి, మిషన్ను అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. పట్టణంలో సేకరించిన వ్యర్థాల రీసైక్లింగ్తో తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. కంపోస్ట్ ఎరువు షెడ్డును పరిశీలించారు. అనంతరం ఎక్స్ ప్లాజాలో వ్యాక్సిన్ సెంటర్ను పరిశీలిం చి, జనరల్ దవాఖానలో పబ్లిక్టాయిలెట్ గ్రీనరీ పను లు చేపట్టాలని అధికారులకు సూచించారు. దుకాణాల్లో పని చేస్తున్న వాళ్లను గుర్తించి వ్యాక్సిన్ వేయించాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్ పాల్గొన్నారు.