అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కరోనా రెండో వేవ్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం శక్తినంతా కూడగట్టుకుని వ్యాధిపై యుద్ధం చేస్తోంది. ఏదైనా సాయం చేశావా బాబూ. లక్షల కోట్లు దోచుకున్నావు. ప్రభుత్వ కాంట్రాక్టులతో హెరిటేజ్ లాభపడింది. ఆదుకునే స్థోమత ఉన్నా ప్రజల మీద కక్షతో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నావు.’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
‘అగ్గి ఎక్కడ ఉందో అక్కడ నీళ్లు చల్లాలి. ఢిల్లీ వైపు చూసే ధైర్యం లేక రాష్ట్రంలో నీళ్లు కుమ్మరిస్తే జారి పడతావ్ చంద్రబాబు. ఇప్పటికే మోకాళ్లు విరగ్గొట్టుకుని నడవలేక పాకుతున్నావ్. మంచం పాలు కాకుండా చూసుకో. విశ్వసనీయత కోల్పోయాక గారడీలు చేసినా, నాటకాలాడినా వృథా ప్రయాస అవుతుందని’ మరో ట్వీట్లో ఎద్దేవా చేశారు.