Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదానానికి పచ్చళ్లను విరాళం ఇచ్చారు. గుంటూరు చిర్రావూరికి చెందిన విజయ ప్రొడక్షన్కు చెందిన కాటూరి రాము 2,040 కేజీల పచ్చళ్లను శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పాచక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజుకు గురువారం అందించారు.
వీటి విలువ సుమారు 6,32,400 రూపాయలు ఉంటుందని దాతలు తెలిపారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.