అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విషాదాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న ఆవేదనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం రాత్రి వెల్లడించారు.
ఇంటర్ ఫస్టియర్లో 61 శాతం, సెకండ్ ఇయర్లో 72 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఫెయిలైన వారిలో కొందరు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 9 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.