అమరావతి : కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్కుమార్ ఎయిమ్స్,ఏపీ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రెండురోజుల పర్యటనలో భాగంగా ఆమె విజయవాడలోని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా పీఎంజేఏవై నిధులతో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకం లోగోపై వైఎస్ రాజశేఖర్రెడ్డి, సీఎం జగన్ ఫొటోలు మాత్రమే ఉండడాన్ని తప్పుబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన కార్డులపై కూడా పీఎం ఫొటో లేకపోవడాన్ని ఆమె గుర్తించారు. ఎయిమ్స్లో నీటి కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిమ్స్లో ఖాళీలను తన దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు. దక్షిణాదిన మొదటి ఎయిమ్స్ మంగళగిరిలోనే ఏర్పాటు చేశామని ఆమె అన్నారు.
అనంతరం ఏపీ వైద్య అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగానికి 60 శాతం నిధులిస్తున్నా కనీసం ఒక్కచోట కూడా మోదీ ఫొటో పెట్టరా అంటూ ప్రశ్నించారు. కనీసం పవర్ పాయింట్ లో కూడా మోదీ ప్రస్తావన లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.