అమరావతి : జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా శంబర, గోపాలపురానికి చెందిన ఎం. రాము, బి.సత్యనారాయణలు మృతి చెందారు.
మంగళవారం రాత్రి శంబర యాత్ర ముగించుకొని ద్విచక్రవాహనంపై పీఎం పాలెంకు బయలు దేరారు. తగరపువలస సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.