అమరావతి : విశాఖపట్నంలోని భీమిలి బీచ్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు.
విశాఖలోని సంగివలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు సముద్రస్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ కెరటంతో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా యామల సూర్య, కుడితి సాయి అనే విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.
గల్లంతయైన విద్యార్థుల కోసం తీరం రక్షణ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మురం చేశారు. ఈ ఘటన మధ్యాహ్నం జరుగగా సాయంత్రం వరకు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆచూకి లభ్యం కాలేదు. సాయంత్రం చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు.